మొక్కలు నాటండి.. పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వండి: అమల

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున భార్య అమల పేర్కొన్నారు. ఇవాళ ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తమ నివాసంలో మొక్కలు నాటారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ IAS విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించిన ఆమె తమ నివాసంలోని ఆవరణలో 5 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా కార్యక్రమం విజయవంతమవడం సంతోషం. ఇలాంటి మంచి ఆలోచనలు అరుదుగా వస్తాయనీ, వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కి ఆమె ధన్యవాదాలు తెలిపారు.